ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ పాత్ర ఎంతో కీలకమైనదన్న విషయం తెలిసిందే.తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యూహ రచన చేస్తే దాన్ని అమలు చేసే బాధ్యతను కోదండరామ్ తీసుకున్నారు.
ఉద్యోగ సంఘాలతో పాటు ఇతర పౌర సంఘాలను సమన్వయం చేసుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు.ఆ సమయంలో ప్రత్యేక రాష్ట్రం వస్తే అందులో కోదండరామ్ ముఖ్యపాత్ర ఉంటుందని అంతా భావించారు.
కానీ కధ అడ్దం తిరిగింది.తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్తో విభేదాల కారణంగా ఆయన ప్రత్యర్థుల లిస్టులో చేరిపోయారు.ఇక అప్పటి నుండి తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కోదండరామ్ ఆశలు ఇప్పటి వరకు నెరవేరలేదు.ఇలా తన రాజకీయ పోరాటంలో చివరికి కాంగ్రెస్తో దోస్తీ కట్టారు.
ఒకగానొక సందర్భంలో రాజకీయంగా కాంగ్రెస్తో విభేదాలు ఉన్నప్పటికీ ఆ పార్టీ అధినాయకత్వంతో కోదండరామ్ చర్చలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.కాగా కేసీఆర్ను ఎదుర్కొనేందుకు కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కోదండరామ్ గత ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు.
ఇకపోతే తాజాగా నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టుభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న కోదండరామ్కు కాంగ్రెస్ పార్టీ ఊహించని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.అయితే తాము మద్దతు ఇవ్వాలంటే కాంగ్రెస్లో చేరాలని ఆ పార్టీ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం.
అంటే కోదండరామ్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలన్న మాట.