మన దేశంలోనే కాదు రాష్ట్రంలో సైతం కొంగ్రెస్ పరిస్థితి చాలా అద్వానంగా తయారయింది.ఒక పక్క నమో మంత్రంతో కొంగ్రెస్ కోటలు బీటలు వారి పోతూ ఉంటే.
మరో పక్క కొంగ్రెస్ పార్టీ నాయకుల వ్యాఖ్యల వల్లనే ఉన్న పరువు సైతం రోడ్డున పడుతుంది.బీజేపీ కొంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రతీ చోట తన జెండా పాతుకుంటూ ముందుకు పోతుంది.
ఇక కొంగ్రెస్ వాళ్ళు తమ పార్టీకి మళ్లీ పునర్జన్మను ప్రసాదించాలి అన్న ఆలోచనో లేక మరోసారి దేశాన్ని ఉద్దరించాలి అన్న ఆవేశమో తెలీదు కానీ మొత్తానికైతే గోరంత చేసి కొండంత పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు అని పూర్తిగా అర్దం అయిపోతుంది.ఇక ప్రస్తుతం కొంగ్రెస్ పార్టీ కేంద్రంలోనే కాదు, రాష్ట్రంలో సైతం దీనమైన పరిస్థితుల్లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే.
ఇప్పుడున్న ఈ పరిస్థితికి అద్దం పట్టే రుజువు ఇదే.కొంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మెంబర్ షిప్ డ్రైవ్ సూపర్ సక్సెస్ అంటూ, ఇక అందులోనూ తెలంగాణా ప్రాంతంలో అయితే రికార్డు స్థాయిలో ఇది కొనసాగుతుంది అని సాక్షాత్తూ ఏఐసీసీ నేత కుంతియా చెబుతూ ఉండగా.అసలు విషయం ఏమిటంటే ఇదంతా కొంగ్రెస్ పార్టీ వాళ్ళు మొక్కు బడిగా చేస్తున్న పని తప్పా, ఇది సక్సెస్ కాలేదు అంటూ బహిరంగంగానే కొంగ్రెస్ వర్గాల్లోనే టాక్ వినపడుతుంది.చేసింది ఏమీ లేదు కానీ గొప్పలు మాత్రం కోటలు దాటుతూ ఉండడంతో పాపం వారికి వారే తిప్పలు తెచ్చుకుంటున్నారు అంటున్నాడు రాజకీయ విశ్లేషకులు.