విశాఖపట్నంలో మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి దారుణ హత్యకు గురైంది.అక్కయ్యపాలెం లో ఓ అపార్ట్ మెంట్ లో ఆమె చనిపోయి రక్తపు మడుగులో కనిపించింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు.విశాఖపట్నంలో ఈ మధ్య కాలంలో ఓ రాజకీయ నేపధ్యం వున్న వ్యక్తిని చంపడం ఇదే మొదటి సారి అని చెప్పాలి.
విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, సిటీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె మళ్ళీ కార్పోరేషన్ ఎలక్షన్స్ కోసం వేచి చూస్తుంది.నిన్న ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేయడానికి వెళ్ళిన ఆమె ఇంటికి తిరిగి రాలేదని తెలుస్తుంది.
అయితే ఊహించని విధంగా ఆమె మృతదేహం ఓ అపార్ట్ మెంట్ లో కనిపించడం అందరిని షాక్ కి గురిచేసింది.కార్పొరేటర్ విజయారెడ్డి మరణ వార్త నగరం మొత్తం వ్యాపించడంతో ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇక ఆమెని హత్య చేసింది ఎవరు అనే విషయాలని తెలుసుకోవడానికి పోలీసులు విచారణ మొదలెట్టారు.