టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ మాజీ సీఎం స్పందన ఇదే.

తెలంగాణాలో కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నా… ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఏపీలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి ఏం జరుగుతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.అయితే…దీనిపై ఇప్పటివరకు ఏ విధమైన ప్రకటన కూడా రాలేదు.కానీ ఈ విషయంపై కాంగ్రెస్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు.అసలు ఏపీలో కాంగ్రెస్ – టీడీపీ పొత్తుకు సంబంధించి ఇంకా ఏ విధమైన క్లారిటీ రాలేదని ఆయన చెప్పుకొచ్చారు.

 Congress Ex Cm Kiran Kumar Reddy Response To The Alliance With Tdp-TeluguStop.com

అనకాపల్లిలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు సమీప బంధువు పరుచూరి భాస్కరరావు కాంగ్రెస్ లో చేరారు.కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తన తప్పు తెలుసుకుందని అన్నారు.టిడిపితో పొత్తుపై ఇంకా స్పష్టత రావల్సి ఉందని ఆయన అన్నారు.వచ్చే ఎన్నికలు ఎపికి ముఖ్యమైనవని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అవసరమని ఆయన అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube