తెలంగాణ రాజకీయలు ఇప్పుడు చాలా వేడి మీదున్నాయి.అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇప్పటి వరకు ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో టీఆర్ ఎస్, బీజేపీలో అనేక పరిణామాలు జరిగాయి.ఇక దాని తర్వాత రేవంత్రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్ను చేయడంతో ఆ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఉత్సాహంతో పాటు సీనియర్ల అసంతృప్తులు, రాజీనామాలతో అట్టుడికిపోయింది.
ఇదిలా ఉండగా ఇప్పుడు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంటోంది.
అదే వైఎస్సార్ కుమార్తెగా తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్న షర్మిల పార్టీ.
ఈరోజు సాయంత్రమే ఆమె పార్టీని ఆవిర్భవించబోతోందని తెలిసిందే.కాగా ఇందుకోసం ఆమె భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ అభిమానులు, ఇతర నేతలు కొందరు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.అయితే ఆమెకు ఓ కాంగ్రెస్ ఎంపీ విషెస్ చెప్పడమే ఇప్పుడు చర్చీనీయాంశంగా మారింది.
ఆయనెవరో కాదు కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించి ఇప్పుడు టీపీసీసీ ఇవ్వకపోవడంతో అసంతృప్తిలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.
షర్మిల పార్టీ సభ ఈరోజు జరుగుతున్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ దగ్గరకు అనూహ్యంగా ఎంపీ కోమటిరెడ్డి వచ్చి ఆగి కాసేపు వైఎస్సార్ అభిమానులతో మమేకం అయ్యారని తెలుస్తోంది.తనను కూడ రావాలని ఆహ్వానం ఇచ్చారని, వైఎస్సార్ గొప్ప ప్రజల మనిషి అని కొనియాడారు.ఈ సందర్భంగా షర్మిలకు విషెస్ చెప్పారు.
దీంతో ఆయన షర్మిలకు ఇన్డైరెక్టుగా సపోర్టు చేస్తారా అనే అనుమానాలు ఊపందుకున్నాయి.ఎందుకంటే ప్రస్తుతం ఆయన కాంగ్రెస్లో అసంతృప్తిగా ఉన్నారు.
ఆయన పార్టీ మారుతారనే వార్తలు కూడా వస్తున్నాయి.ఇలాంటి ఊహాగానాల నడుమ ఆయన షర్మిలకు ఆల్ది బెస్ట్ చెప్పడమే కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు.
రేవంత్ కూడా వ్యక్తిగత నినాదాలు ఇవ్వొద్దని చెప్పిన వెంటనే ఇలా చేశారు కోమటిరెడ్డి.చూడాలి మరి ఆయన ఏ పార్టీలో చేరుతారో.