రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గం.కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా బలహీనంగా ఉన్నా హుజూరాబాద్ లో ప్రతి ఎన్నికలో కూడా ఈటెలకు గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి మాత్రం ఉంది.
అయితే దుబ్బాకలో కాంగ్రెస్ అగ్ర నాయకులందరు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా అక్కడ ఏ మాత్రం సత్తా చాటని విషయం మనం చూశాం.అయితే దుబ్బాక పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు తేడా ఉండడం అంతేకాక టీఆర్ఎస్ ఇక్కడ చీలిపోయిన దశలో చీలిన ఓట్లు కాంగ్రెస్ కు లాభిస్తాయనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్న పరిస్థితి ఉంది.
అందుకే ఇప్పుడు హుజూరాబాద్ పై కూడా కాంగ్రెస్ నేతలు గట్టి ఫోకస్ పెట్టారు.జీవన్ రెడ్డి లాంటి నేతలు ఇప్పటికే క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేసేందుకు హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డితో భేటీ అయి పకడ్భందీ వ్యూహాన్ని రూపొందిస్తున్న పరిస్థితి ఉంది.ఒకవేళ కాంగ్రెస్ హుజూరాబాద్ లో విజయం సాధిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయ్యే అవకాశం ఉంది.ఇంకా కాంగ్రెస్ నేతలు అధికారికంగా స్పందించకున్నా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యాక స్పందించే అవకాశం ఉంది.
మరి కాంగ్రెస్ ఏ విధంగా సత్తా చాటుతుందనేది చూడాల్సి ఉంది.