తెలంగాణాలో ఎన్నికల యుద్ధం దాదాపు ముగిసిపోయింది.టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత తెచ్చుకుంది.
ఎంతో ఊహించుకుని ఎన్నికల సమరంలోకి దూకిన కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో ఘోర పరాజయం దిశగా అడుగులువేసింది.అయితే టీఆర్ఎస్ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించినా… ఇంకా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొంతమంది ఆ పార్టీ విజయాన్ని ఒప్పుకోవడంలేదు.అందుకే… ఎన్నికల సంఘానికి ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ సంఘం కన్వీనర్ జి నిరంజన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ కి లేఖ రాశారు.ఈవీఎంలను తారుమారు చేశారనే బలమైన అనుమానాన్ని నిరంజన్ వ్యక్తం చేశారు.ఈవీఎంలలో వస్తున్న ఫలితాలు క్షేత్రస్థాయి వాస్తవాలకి చాలా తేడా ఉందని తెలిపారు.
ఫలితాల ప్రకటనకు ముందు అన్ని ఈవీఎంలకు చెందిన వీవీప్యాట్ కాగితాలను 100% లెక్కించాల్సిందిగా కోరారు
.తాజా వార్తలు