ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామన్న ఉత్తమ్‌

ఇటీవలే అనారోగ్య కారణాలతో దుబ్బాక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సొలిపేట రామలింగరెడ్డి మృతి చెందిన విషయం తెల్సిందే.ఆయన మృతితో దుబ్బాక ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయ్యింది.

 Congress Clarity On Dubbaka Assembly Seat By Election, Uttam Kumar Reddy, Dubbak-TeluguStop.com

త్వరలో ఆ స్థానంకు ఉప ఎన్నికలు రానున్నాయి.మూడు నెలల లోపు ఎన్నికల్లో జరిగే అవకాశం ఉందంటున్నారు.

సాదారణంగా ఇలాంటి ఉప ఎన్నికల్లో పోటీ ఉండదు.మానవతా దృక్పదంతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఆ స్థానంను కేటాయించడంతో పాటు వారిని ఏకగ్రీవం చేస్తారు.

గతంలో పలు సార్లు ఇలా జరిగింది.కాని ఆమద్య తెరాసా ఒకటి రెండు సార్లు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పోటీకి పెట్టింది.ఆ కారణంగానో లేదంటే మరేంటో కాని దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించాడు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగరెడ్డి మృతి పట్ల తమకు విచారం ఉన్నా కూడా ఆ స్థానంలో ప్రజాస్వామ్య బద్దంగా తాము పోటీకి దిగబోతున్నాం అంటూ ఉత్తమ్ ప్రకటించారు.

అయితే దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయం అంటూ ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పోటీకి వచ్చి పరువు తీసుకోవడం అవుతుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube