ఇప్పుడిప్పుడే దేశంలో కాంగ్రెస్ బలపడుతుంది అని అనుకుంటున్నా సమయంలో రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభానికి గురికావడం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.దీంతో ఈ సంక్షోభానికి కారణమైన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై అధినేత్రి సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీలో వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామంతో అధ్యక్ష పదవికి సంబంధించి అశోక్ గెహ్లాట్ పేరు కాకుండా మరి కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కమల్ నాథ్, దిగ్విజయ్, ఖర్గే, సుశీల్ కుమార్ షిండే, ముకుల్ వాసనిక్, కుమారి షాల్జా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ పరిణామాలపై నేడు సోనియాకి మాకెన్, ఖర్గే నివేదిక ఇవ్వనున్నారు.దీంతో సోనియా గాంధీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.ఒకపక్క రాహుల్ చేపట్టినభారత్ జోడోపాదయాత్ర పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే రీతిలో ఉంటూ వస్తున్న తరుణంలో.రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభానికి గురి కావటం.
దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.