మనదేశంలో కరోనా అడుగు పెట్టి సంవత్సరం దాటుతున్నా దీని విధ్వంసం ఏమాత్రం తగ్గడం లేదు.ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఊహించని విధంగా ఉండగా, ఇంకా ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉంది.
ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు ఈ మయదారి రోగానికి బలి అవ్వగా, ఇంకా కరోనా ఉదృతి దేశంలో కొనసాగుతు ఉంది.ఇదిలా ఉండగా కరోనా బారిన పడి మరో పొలిటికల్ లీడర్ మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆ వివరాలు చూస్తే.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రెజాల్ హక్ కరోనా సోకి మరణించారు.
కాగా కరోనా నిర్ధారణ కావడంతో రెండ్రోజుల క్రితం కోల్కతా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రెజాల్ పరిస్థితి విషమించడంతో ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారట.
ఇకపోతే ముర్షీదాబాద్ జిల్లాలో ఉన్న షంషేర్గంజ్ లో ఏడో విడతలో భాగంగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
కాగా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెజాల్ హక్ బరిలో ఉన్నారు.అయితే మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా ఇలా ఈయన హఠాత్తుగా మరణించడం విషాదకరం.