కరోనా సెకండ్ వేవ్ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేశారు గానీ, దీని వల్ల మరణాలు చాలానే చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే చాలా మంది ప్రముఖులు దీని బారిన పడి మరణిస్తుండగా, తాజాగా మరో కాంగ్రెస్ నేతను పొట్టన పెట్టుకుంది కరోనా.
ఆ వివరాలు చూస్తే.
తమిళనాడు కాంగ్రెస్ నేత మాధవరావు కరోనా బారినపడి మరణించిన ఘటన ఆ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపిందట.
ఈయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీవిల్లి పుత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
కాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కరోనా బారిన పడ్డారట.
ఈ క్రమంలో మాధవరావు అనారోగ్యానికి గురికాగా మధురైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారట.ఇక మాధవరావు మృతిపై ఏఐసీసీ కార్యదర్శి సంజయ్ తీవ్ర దిగ్బాంత్రి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేశారు.