కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 22వ రోజుకు చేరుకుంది.ఇప్పటివరకు ఈ పాదయాత్ర 450 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
కేరళ రాష్ట్రంలో పూర్తయిన రాహుల్ పాదయాత్ర నేడు తమిళనాడులోకి ప్రవేశించనుంది.అదేవిధంగా ఈనెల 30న కర్ణాటకకు చేరుకోనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాహుల్ పాదయాత్రకు భారీగానే స్పందన వస్తుంది.విద్యార్థులు, వివిధ పార్టీల నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఈ యాత్రలో రాహుల్ తో కలిసి నడుస్తున్న విషయం తెలిసిందే.