తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం చాలా మంది నాయకులు ఉన్న కూడా ఒక్కరికి స్థిరత్వం లేదు.ఎవరికి వారు పెత్తనం చెలాయిస్తూ ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నారు.
పార్టీ వాయిస్ వినిపించే సమయంలో ఒకే స్టాండ్ మీద ఉండకుండా ఎవరికి వారు వ్యక్తిగతంగా రియాక్ట్ అవుతూ ఉంటారు.ఇక అందరిని సమన్వయం చేసే నాయకత్వంలో ఓ విధంగా తెలంగాణలో కొరవడింది అని చెప్పాలి.
నిజానికి తెలుగు రాష్ట్రాలలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య ఉంది.అయితే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వ లక్షణాలతో అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి లీడర్ గా ఏమర్జ్ అయ్యారు.
అతనికి ముందుగాని, తరువాత గాని కాంగ్రెస్ పార్టీని స్ట్రాంగ్ గా నడిపించే లీడర్ లేడని చెప్పాలి.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిలబడానికి అవకాశం ఉన్న కేవలం నాయకత్వ లోపం కారణంగానే టీఆర్ఎస్ కి పోటీ ఇవ్వలేకపోతుంది.
ఈ నేపధ్యం టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ లీడర్ గా అ పార్టీలో ఉన్నారు.కేసీఆర్ కి ఎదురు నిలబడి మాట్లాడే దమ్ము, ధైర్యం అతనికి ఉంది.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పగ్గాలు అతనికి అప్పగించాలని సోనియా గాంధీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.రానున్న ఎన్నికల నాటికి పార్టీని పటిష్టంగా తయారు చేసి అందరిని ఏకతాటిపైకి తీసుకురావాలంటే రేవంత్ రెడ్డి వలెనే సాధ్యం అని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో అతని నియోజకవర్గ పరిధిలో మున్సిపాలిటీలలో పార్టీని గెలిపించే విధంగా చేస్తే ఎన్నికలు జరిగిన వెంటనే రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.మరి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన ఈ అవకాశాన్ని రేవంత్ రెడ్డి ఎలా ఉపయోగించుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.