ప్రస్తుతం ఉన్న 20కు పైగా న్యూస్ ఛానెల్స్ లో దాదాపుగా అన్నీ ఏదో ఒక పార్టీకి కొమ్ముకాసే ఖాతాలోకే వెళ్ళిపోతాయి.ఒకటి రెండు నిష్పక్షపాతంగా వ్యవహరించినా వాటిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రతీ పార్టీకి ఒక ఛానెలా, ఒక పత్రిక కొమ్ము కాస్తున్నాయి.అందులో అధికార తెలుగుదేశానికి ఆది నుంచి ప్రధాన పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు ఆ యాజమాన్యాల ఆధిపత్యంలోని ఛానాళ్లు అండగా నిలుస్తున్నాయన్న సంగతి తెలిసిందే, ఇక మరో ప్రధాన పత్రిక, ఛానెల్ గా చెప్పుకుని తిరిగే సాక్షి మొదట కాంగ్రెస్ అనుకూల మీడియాగా ఉన్నా.
జగన్ సొంత కుంపటి పెట్టుకోవడంతో ఆయన సొంత డబ్బాను ప్రసారం చేసే పరికరంగా మారిపోయింది.ఇక టీఆర్ ఎస్ కూడా టీ న్యూస్, నమస్తే తెలంగాణ పత్రికలు నడుపుకుంటూ తమ డప్పు తామే కొట్టుకుంటున్నారు.
వాపక్షాలకు సైతం తమ సొంత చానెళ్లు ఉన్నాయి.వీటన్నిటి మధ్యలో మాకు ఒక ఛానెల్ కావాలి అంటున్నారు కొంగ్రెస్ పార్టీ వాళ్ళు, మంగళవారం గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో, ప్రసార మాధ్యమాల ద్వారా పార్టీకి ఆశించిన ప్రచారం జరగడం లేదని, కాంగ్రెస్కు సొంతంగా టీవీ, పత్రికలు కావాలని తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్సింగ్ ను ఆ పార్టీ నేతలు గట్టిగా కోరారని సమాచారం.
మరి దీనిపై డిక్కీ సార్ ఏమంటారో చూడాలి.