కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన సరికొత్త వ్యవసాయ బిల్లుకి ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించిన విషయం తెలిసిందే.ఈ బిల్లుకు విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తం చేస్తున్నాయి.
రాజ్యసభలో విపక్ష పార్టీల బలం అధికంగా ఉన్న కూడా కేంద్ర ప్రభుత్వం తమ అధికార బలంతో బిల్లును పాస్ చేసుకుంది అంటూ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విపక్షాలు రాష్ట్రపతి ని ఆశ్రయించిన రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరబోతున్నారు.
పార్లమెంటులో పాస్ అయిన వ్యవసాయ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం తెలిపి సైన్ చేయాల్సి ఉంటుంది.అప్పుడు అది చట్టరూపం దాల్చనుంది.ఈ బిల్లును ఆమోదించకుండా వెనక్కి పంపించాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్ష పార్టీలు అన్ని రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రపతి ఈ బిల్లును వెనక్కి తిప్పి పంపి దేశ రైతాంగాన్ని ఆదుకోవాలని అంటూ కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.
అయితే రాష్ట్రపతి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా ఉంది.