ఢిల్లీలోని పార్లమెంట్ లో గందరగోళం నెలకొంది.దీంతో ఉభయసభలు వాయిదా పడ్డాయి.
విపక్ష సభ్యుల ఆందోళనలతో ప్రారంభమైన వెంటనే సభలు వాయిదా పడినట్లు తెలుస్తోంది.లోక్ సభ మధ్యాహ్నం 4 గంటల వరకు వాయిదా పడగా.
రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ప్రతిపక్షాలు నిరసిస్తున్నాయి.
ఈ క్రమంలోనే నల్లదుస్తులు, నల్ల రిబ్బన్లు ధరించి ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ కు వచ్చారు.మరోవైపు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తుండటం గమనార్హం.