తెలంగాణ కాంగ్రెస్ ప్రజల్లో పలుచబడడానికి ప్రధానమైన కారణం నాయకుల మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరు అనేది సుస్పష్టం.అయితే ఇప్పటి వరకు ఎంత మంది పీసీసీ అధ్యక్షులు మారినా నాయకుల మధ్య విభేదాలతో ప్రతి ఎన్నికలో ప్రజల ఆదరణ కోల్పోతూ వస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ఇదే పరిస్థితి ఉండడం నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోంది.అయితే కాంగ్రెస్ లో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేగిందని చెప్పవచ్చు.
అయితే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై హై కమాండ్ వివరణ కోరినా అందరు ఒక్కతాటిపైకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.ఇప్పుడు కావలిసింది ఐక్యతా పోరాటం.ఎక్కడా ఐకమత్యం లోపం జరిగినా కాంగ్రెస్ కు తీవ్ర నష్టం జరిగేందుకు ఆస్కారం ఎక్కువ అన్నది మనకు తెలిసిన విషయమే.ఇక హైకమాండ్ ఇప్పటికైనా అంతర్గత విభేదాలపై దృష్టి సారించకపోతే ఇదే తరహా పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మంచి రోజులు వచ్చినట్టే అని మనం అర్థంచేసుకోవచ్చు.మరి ఈ విభేదాలపై హైకమాండ్ జోక్యం చేసుకుటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.