తెలంగాణలో టీడీపీ పార్టీ మనుగడ అన్నది చాలా కష్టతరమైన అంశం.ప్రజల మనస్సులో నుండి ఎప్పుడో వెళ్లి పోయిన అంశం.
ఎందుకంటే తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదిపిన చంద్రబాబు వైఖరిని తెలంగాణ ప్రజలు దుమ్మెత్తి పోసిన విషయం తెలిసిందే.అయితే ఆ తరువాత తెలంగాణ ఆవిర్భావం తరువాత ఇక టీడీపీకి భవిష్యత్తు నిర్ధారించుకున్న టీడీపీ నేతలు ఇక చాలా వరకు టీడీపీ నేతలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు.
ఇక టీడీపీలో అప్పటి వరకు ఉన్న నేతలు మెల్లగా ఇతర పార్టీలలోకి వెళ్లి పోవడంతో ఇక టీడీపీ ప్రజల్లో యాక్టివ్ గా ఉండలేక పోయింది.
కాని ఎంత మంది నేతలు పార్టీ మారినా ఎల్.రమణ మాత్రం పార్టీ మారలేదు.గడ్డు కాలంలో కూడా పార్టీని పట్టుకుని ఉన్న ఎల్.రమణ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తుపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.అయితే అప్పట్లోనే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా ప్రచారం జరిగినా తరువాత విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఖండించిన విషయం తెలిసిందే.
అయితే త్వరలో కెసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినా ఈ విషయం ఖాయం అన్నట్లు తెలుస్తోంది.మరి దీనిపై మరింత సమాచారం భవిష్యత్తులో తెలియాల్సి ఉంది.