హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.ఉదయం 6.30 గంటలకు వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
వెంటనే గమనించిన ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానంలోని సుమారు 200 మంది ప్రయాణికులను దించివేసింది.
విమానం ఎక్కిన తరువాత సిబ్బంది సమస్యను గుర్తించడం ఏంటని ప్రయాణికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.అనంతరం అధికారులు మరో ఫ్లైట్ ద్వారా ప్రయాణికులను సురక్షితంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు.