నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమాతో నితిన్ మరో సారి ఎబ్భై కోట్ల క్లబ్ లో చేరాడు.
లవ్ అండ్ ఎంటర్టైనర్ తో పాటు సోషల్ మెసేజ్ తో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.అయితే రిలీజ్ కి ముందు ఈ సినిమా టైటిల్ మీద కొద్దిగా వివాదం చెలరేగింది.
భీష్మ టైటిల్ ని మార్చాలని కొన్ని హిందుత్వ సంస్థలు పట్టుబట్టాయి.అయితే దర్శకుడు, నిర్మాత మాత్రం ఎలాంటి మార్పు చేయకుండా వదిలారు.
ఇప్పుడు ఆ గొడవ సద్దుమణిగింది.
అయితే ఇప్పుడు దీనికి మరో కొత్త తలనొప్పి వచ్చింది.
ఈ సినిమాపై గంగపుత్ర సంక్షేమ సంఘం మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు భీష్మ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అభ్యంతరంగా ఉన్నాయని, అలాంటి సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.సినిమా విడుదలై 20 రోజులకు పైగా పూర్తయిన తర్వాత ఇటువంటి ఫిర్యాదు రావడంతో మరోసారి భీష్మ వార్తల్లో నిలిచింది.
ఈ ఫిర్యాదుపై హ్యూమన్ రైట్స్ ఎలా స్పందిస్తుంది.చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.