ముఖ్యమంత్రి చంద్రబాబుపై.హోం మంత్రి చినరాజప్పకు ఫిర్యాదు చేయడం ఏంటని షాక్ అవుతున్నారా ? ఎస్ ఈ ఫిర్యాదు నిజమే.? ఇందుకు కారణం చంద్రబాబే అంటున్నారు గుంటూరు జిల్లా తెలుగు తమ్ముళ్లు.చంద్రబాబుపై తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదు చేయడంతో చినరాజప్ప అవాక్కయ్యారట.
మరి చంద్రబాబుపైనే ఫిర్యాదు వెనక కారణం ఏంటో చూద్దాం.కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లాలకు చెందిన మంత్రి రావెళ్ళ కిషోర్ బాబు, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జానీమూన్ మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.
ఈ వివాదంలో జానీమూన్ ఏకంగా మీడియా ముందుకు వచ్చి సొంత పార్టీకి చెందిన మంత్రి అని చూడకుండా రావెలపై విమర్శలు చేశారు.ఇది ఏపీ టీడీపీలో ప్రకంపనలు రేపింది.
దీనిపై సీరియస్ అయిన చంద్రబాబునాయుడు హోం మంత్రి చినరాజప్పతో పాటు పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ.ఆంజనేయులతో కలిసి ఓ కమిటీ వేశారు.
ఈ కమిటీ జిల్లా నియోజకవర్గ, జిల్లా టీడీపీ నేతలతో భేటీ అవ్వగా వారు చేసిన ఫిర్యాదులతో హోం మంత్రి చినరాజప్ప షాక్ అయ్యారట.మంత్రి రావెల, చైర్పర్సన్ జానీమూన్ మధ్య వివాదంలో తప్పు ఎవరిది ? అన్న ప్రశ్నకు పార్టీ నేతలంతా సీఎం చంద్రబాబుదే తప్పు అని కుండబద్దలు కొట్టారట.పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని రావెళ్ల కిషోర్ బాబుకు టిక్కెట్ ఇఛ్చి ఎమ్మెల్యేను చేయటమే కాకుండా మంత్రి పదవి ఇవ్వటం ఏంటని ? వీరు ప్రశ్నించారట.
ఇక పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కనపెట్టి జానీమూన్కు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఇవ్వడం ఏంటని ? వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట.ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని.పార్టీ సిద్ధాంతాల ప్రకారం పనిచేసే వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెడితే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారట.వారిద్దరికి పార్టీపై ఏ మాత్రం కమిట్మెంట్ లేదని కూడా గుంటూరు జిల్లా తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారట.
పార్టీని దశాబ్దాలుగా నమ్ముకుని ఉంటోన్న వాళ్లకు చిన్న చిన్న కార్పొరేషన్ పదవులు కూడా ఇవ్వడం లేదని.
అదే కొత్తగా వచ్చిన వారికి మాత్రం మంత్రులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాంటి పదవులు వస్తున్నాయని వారు బాబు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట.అది చంద్రబాబుపై ఫిర్యాదు వెనక స్టోరీ.