హైదరాబాద్ కేపీహెచ్‎బీలోని ఓ చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులపై ఫిర్యాదు

హైదరాబాద్ కేపీహెచ్‎బీలోని మైత్రి చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులపై కేసు నమోదు అయింది.మేడ్చల్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఫిర్యాదు చేశారు.

 Complaint Against The Administrators Of A Children's Home In Hyderabad Kphb-TeluguStop.com

చిల్డ్రన్ హోమ్ లోని చిన్నారులతో బాత్రూం క్లీనింగ్, కూరగాయాలు తరగడం వంటి పనులు చేయిస్తున్నట్లు గుర్తించారు.అంతేకాకుండా నిర్వాహకులు బీఎల్ నరసింహరావు, అతని కొడుకు బి.ప్రణీత్ కుమార్ లు కాళ్లకు కూడా మసాజ్ చేయించుకున్నారని సమాచారం.పనులు చేయకపోతే పిల్లలను బెల్ట్ తో కొడుతున్నట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో తండ్రీ కొడుకులపై జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది.అనంతరం చైల్డ్ వేల్ఫేర్ కమిటీ ఆదేశాలతో చిన్నారులను మరో హోంకు తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube