సంవత్సరం ముందు వరకు కత్తి మహేష్ ఎవరికి తెలియదు.కాని బిగ్బాస్ మొదటి సీజన్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక్కసారిగా మీడియాలో స్టార్ అయ్యాడు.పవన్ను కత్తి మహేష్ విమర్శించడం, పవన్ ఫ్యాన్స్ ఆయనపైకి దాడికి ప్రయత్నించడం ఇలా అనేక కారణాల వల్ల కత్తి మహేష్ స్టార్ అయ్యాడు.
కత్తి మహేష్ ఆ మద్య పవన్ ప్రతి కదలికను విమర్శిస్తూ వచ్చాడు.ఆ సమయంలో పవన్ స్వయంగా రంగంలోకి దిగి ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దంటూ సూచించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కత్తిపై సోషల్ దాడిని తగ్గించారు.
గత కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న కత్తి మహేష్ మళ్లీ మీడియాలో ప్రధానంగా కనిపిస్తున్నాడు.ఇటీవల ఒక టీవీ ఛానెల్ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది.హిందువులు పవిత్రంగా భావించే రాముడి గురించి అనాలోచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, హిందూ ధర్మంపై నమ్మకం కోల్పోయేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.రాముడు మంచి వాడు కాదన్న రీతిలో కత్తి మహేష్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
రాముడు ఎంత ఆదర్శనీయుడో, అంత దగుల్బాజీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.దాంతో పాటు సీత కూడా చివరి వరకు రాముడితో ఉంటే ఆమెకు న్యాయం జరిగేది అన్నాడు.
రామాయణం ఒక కథ అని, రాముడు ఉన్నాడో లేడో అన్నట్లుగా కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.హిందూ సంఘం నాయకులు తాజాగా కత్తి మహేష్పై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన మాట్లాడిన ఫుటేజ్ను పరిశీలించి, మతసామరస్యంను చెడగొట్టే విధంగా కత్తి మహేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కేసు నమోదు చేయడం జరిగింది.
ప్రస్తుత సమాజంలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఎలాంటి బేషజాలు లేకుండా హాయిగా జీవిస్తున్న సమయంలో కత్తి మహేష్ వంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతలకు ముప్పు అంటూ కొందరు ప్రజా సంఘాల వారు కూడా అంటున్నారు.
మొత్తానికి కత్తి మహేష్ నోరు జారి పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నట్లయ్యింది.త్వరలోనే కత్తి మహేష్పై లీగల్ చర్యలకు సిద్దం అవ్వడంతో పాటు, ఆయన్ను అరెస్ట్ కూడా చేసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.