సీనియర్ స్టార్ హీరోలలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలుగా చిరంజీవి, బాలయ్యలకు గుర్తింపు ఉంది.ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద చాలా సందర్భాల్లో పోటీ పడ్డారు.
అయితే చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతకాలం పాటు చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ లేకుండా పోయింది.అయితే ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు 2017 సంవత్సరంలో పోటీ పడగా ఈ రెండు సినిమాలు హిట్లుగా నిలిచాయి.
ఖైదీ నంబర్ 150 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోగా గౌతమీ పుత్ర శాతకర్ణి 50 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించడంతో అటు బాలయ్య అభిమానులు ఇటు చిరంజీవి అభిమానులు చాలా సంతోషించారు.
అయితే చిరంజీవి, బాలయ్య బాక్సాఫీస్ వద్ద మళ్లీ పోటీ పడబోతున్నారని సమాచారం అందుతోంది.చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాను దసరాకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే బాలయ్య సైతం తన సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.
అధికారికంగా ప్రకటించకపోయినా చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ గ్యారంటీ అని తెలుస్తోంది.అటు గాడ్ ఫాదర్ పై ఇటు బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీపై సమాన స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలలో ఏ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.
ఈ రెండు సినిమాల బడ్జెట్లు దాదాపుగా సమానమేనని తెలుస్తోంది.గాడ్ ఫాదర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.చిరంజీవి, బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బాలయ్య కూడా తన సినిమాను దసరాకు రిలీజ్ చేస్తూ చిరంజీవికి ట్విస్ట్ ఇచ్చారనే సంగతి తెలిసిందే.
చిరంజీవి షాకయ్యేలా బాలయ్య ట్విస్ట్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.