విశాఖలో మోడీ పర్యటనకి నిరసనగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే.ఏపీ విభజన హామీలు అమలు చేయకుండా తెలుగు ప్రజలని దారుణంగా మోసం చేసిన మోడీకి ఏపీలో పర్యటించే అర్హత లేదని, ప్రత్యేక హోదా తక్షణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాని పర్యటనకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు నిరసన ప్రదర్శనకి పిలుపునిచ్చాయి.
దీంతో ప్రస్తుతం విశాఖ మొత్తం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
ఇదిలా వుంటే ప్రధాని పర్యటన నేపధ్యంలో విశాఖ మొత్తం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలతో భారీ భద్రత ఏర్పాటు చేసారు.
నిరసన ప్రదర్శనలు ప్రధాని సభ వద్దకి రాకుండా భద్రతా సిబ్బంది పూర్తిగా కట్టుదిట్టం చేసారు.ఇదిలా వుంటే సిపీఐ నిరసన ర్యాలీ కాస్తా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కమ్యూనిస్ట్ నేతలని అరెస్ట్ చేసారు.
అయితే కమ్యూనిస్ట్ నేతలతో పాటు తెలుగు దేశం పార్టీ శ్రేణులు కూడా ప్రధాని పర్యటనని నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.ఇలాంటి ఉద్రిక్తకర పరిస్థితిలో ప్రధాని బహిరంగ సభలో ఎలాంటి ప్రసంగం ఇస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
.