బుల్లితెర షోలు, సీరియళ్ల ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి సినిమా రంగానికి చెందిన వాళ్లు ఆసక్తి చూపరు.అయితే ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్స్ గా వెలుగు వెలుగుతున్న వాళ్లు ఒకప్పుడు బుల్లితెరపై సత్తాచాటిన సెలబ్రిటీలు కావడం గమనార్హం.
ఈ సెలబ్రిటీలలో కొంతమంది బుల్లితెర సెలబ్రిటీలు అని ఇప్పటికే కొంతమందికి తెలిసినా మరి కొందరు కూడా బుల్లితెరపై కెరీర్ ను మొదలుపెట్టారని తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలతో తన రేంజ్ ను మార్చుకున్న యశ్ ఈటీవీ కన్నడలో పలు సీరియళ్లలో నటించి గుర్తింపును సంపాదించుకున్నారు.
నంద గోకుల అనే సీరియల్ తో మంచి పేరును సొంతం చేసుకున్న యశ్ కెరీర్ విషయంలో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.మరో ప్రముఖ నటి నయనతార మలయాళ ఛానల్ లో ప్రజెంటర్ గా కెరీర్ ను మొదలుపెట్టారు.
దాదాపుగా సంవత్సరం పాటు నయనతార అక్కడ పని చేశారు.హీరోయిన్ సాయిపల్లవి ఢీ షో ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.ఈ షోలో డ్యాన్స్ వల్లే సాయిపల్లవికి సినిమాలలో వరుస ఆఫర్లు వచ్చాయి.మహానటి కీర్తి సురేష్ బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు.ప్రస్తుతం వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ కెరీర్ ను కొనసాగిస్తున్నారనే సంగతి తెలిసిందే.మరో ప్రముఖ నటి నజ్రియా కూడా బుల్లితెర ద్వారానే కెరీర్ ను మొదలుపెట్టారు.
ఒక క్విజ్ ప్రోగ్రామ్ కు యాంకర్ గా ఆమె పని చేశారు.ప్రస్తుతం నటిగా, నిర్మాతగా నజ్రియా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ కుంకుమ భాగ్య సీరియల్ తో కెరీర్ ను మొదలుపెట్టి ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.