తెలుగు సినిమా పరిశ్రమకు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన సావిత్రి జీవిత చరిత్రను తెరకెక్కించబోతున్నారు అనగానే అందరిలో ఆసక్తి కలిగింది.ఇతర హీరోయిన్స్తో పోల్చితే ఆమె వంద శాతం విభిన్నమైన వ్యక్తి.
ఆమె స్టార్ అవ్వడం, వివాహం, మద్యానికి బానిసవ్వడం, మరణం ఇలా అన్ని కూడా సినిమాటిక్గానే జరిగాయి.అందుకే ఆమె జీవిత చరిత్ర సినిమా తీయాలని దర్శకుడు నాగ్ అశ్విన్ గట్టిగా కోరుకున్నాడు.
ఆయన అనుకున్నట్లుగానే మహానటిని తెరకెక్కించాడు.అందరు భావించినట్లుగానే సావిత్రి జీవిత చరిత్రను దర్శకుడు పు ఆసక్తికర అంశాలతో తెరకెక్కించాడు.
ఊహించని విధంగా సావిత్రి జీవిత కథకు అద్బుతంగా తెర రూపం ఇచ్చాడు.
తాజాగా విడుదలైన మహానటికి వెబ్ మీడియా వారు అంతా కూడా భారీ రేటింగ్లు ఇస్తున్నారు.ఇప్పటి వరకు బాహుబలి సినిమాకు అత్యధిక సరాసరి రేటింగ్ వచ్చింది.అయితే మహానటికి అంతకు మించిన రేటింగ్స్ వచ్చాయి.
వెబ్ మీడియా నీరాజనాు పలుకుతున్న మహానటి చిత్రంపై సాదారణ ప్రేక్షకులు మరియు సగటు సినిమా అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.ఒక మంచి చరిత్రను చూసినట్లుగా అనిపిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినిమా చరిత్రను కళ్ల ముందు పెట్టినందుకు కృతజ్ఞతలు అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్కు సందేశాలు పంపుతున్నారు.
మహానటి గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నారు.
అయితే ఒక సాదారణ వ్యక్తి తన సోషల్ మీడియా పేజీలో మహానటి గురించి ఇలా రాసుకున్నాడు.నేను ఒక సాదారణ సినిమా ప్రేక్షకుడిని, సినిమా ట్రైలర్ చూసి, టీజర్ చూసి బాగుంటుందనిపిస్తే వెళ్తాను, ప్రయోగాలు, ఫ్లాప్ సినిమాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపించను.
వందల రూపాయలు పెట్టి సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా పూర్తి తృప్తినివ్వాలనే ఉద్దేశ్యంతో తాను సినిమాకు వెళ్తాను.ఒక సినిమాకు వెళ్లాలని అనుకున్నప్పుడు ఆ సినిమా స్టార్ కాస్టింగ్, డైరెక్టర్ ఇలా అన్ని విషయాలను బేరీజు వేసుకుని వెళ్తాను.
కాని మహానటి చిత్రం అనగానే అవన్ని నాకు ఆలోచనకు రాలేదు.ఆమె గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో సినిమా టాక్తో కూడా సంబంధం లేకుండా ముందే టికెట్లు బుక్ చేశాను.
నేను ఊహించిన దానికంటే దర్శకుడు అద్బుతంగా తెరకెక్కించాడు.ఇంత కాలంగా నాలో సావిత్రి గారి గురించి ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లభించాయి.
ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శం అవ్వాలి.ఇలాంటి వారి గురించి తెలుసుకోవడం అందరికి మంచిది.
తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన సావిత్రి గారికి అసలైన నివాలిగా దర్శకుడు సినిమాను తెరకెక్కించాడు.సావిత్రి గారిని చూస్తున్నట్లుగానే అనిపించేలా కీర్తి సురేష్ కనిపించారు అంటే దర్శకుడు ఎంతగా వర్కౌట్ చేశాడో చెప్పుకోవచ్చు.
ఇలాంటి అద్బుతమైన సినిమాలు తెలుగు సినిమాకు అవసరం అంటూ పోస్ట్ చేశాడు.ఎంతో మంది మహానటి గురించి ఇదే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.