ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం సాయంత్రం 4 గంటలకు జరగనుంది.ఈ భేటీలో సీపీఎస్ పై మంత్రుల కమిటీ చర్చించనుంది.
ఈ మేరకు 20 ఉద్యోగ సంఘలకు చర్చలకు రావాలని ఏపీ ప్రభుత్వం ఆహ్వానం పంపింది.అయితే ప్రభుత్వంతో చర్చలను ఏపీ సీ పీ ఎస్ యూ ఎస్ బహిష్కరించినట్లు తెలుస్తోంది.
జీపీఎస్ ప్రతిపాదనను ఇది వరకే తిరస్కరించింది.పాత పెన్షన్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో చర్చలతో ప్రయోజనం ఉండదని బహిష్కరించినట్లు సమాచారం.
గతంలో కూడా సీపీఎస్ పై చర్చలంటూ ప్రభుత్వం జీపీఎస్ ప్రతిపాదనలు చేసింది.ఓపీఎస్ మినహా మరే ప్రతిపాదనలు వద్దని ఎపీ సీ పీ ఎస్ యూ ఎస్ అధ్యక్షుడు మరియదాస్ స్పష్టం చేశారు.