తాజాగా జరిగిన సినీ మా అవార్డ్స్పై విమర్శలు వస్తున్నాయి.మాటీవీ నిర్వహించిన ఈ అవార్డు వేడుకల్లో ఇష్టం వచ్చినట్లుగా అవార్డులు ఇచ్చారంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో అవార్డు పెట్టి పంపించారని కొందరు ఎద్దేవ చేస్తున్నారు.సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ అందరికి అవార్డును ఇవ్వడం వల్లే ఈ విమర్శలు వస్తున్నాయి.
కృష్ణ, మహేష్బాబు, గౌతం కృష్ణ ఇలా ముగ్గురికి కూడా మాటీవీ అవార్డులను ఇచ్చింది.
అవార్డులు ఇస్తామని చెప్పడం వల్లే మహేష్బాబు తన కుటుంబం మొత్తంతో వచ్చినట్లుగా తెలుస్తోంది.
సూపర్ స్టార్ కృష్ణకు జీవిత సాఫల్య అవార్డు, మహేష్బాబుకు ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు.ఉత్తమ నటుడిగా పలువురికి అవార్డును ఇచ్చారు.అందులో మహేష్ ఒకడు.ఇక ఉత్తమ డెబ్యూ చైల్డ్ ఆర్టిస్టుగా సూపర్ స్టార్ తనయుడు గౌతం కృష్ణ అవార్డును అందుకున్నాడు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి ఇలా అవార్డు ఇవ్వడం చాలా అరుదు.కాని మాటీవీ మాత్రం తమ చేతిలో పని కనుక, వారితో సన్నిహిత సంబంధాల కోసం ఇలా అవార్డులు ఇచ్చేసింది అనే విమర్శలు వస్తున్నాయి.
మరి మాటీవీ ఈ విషయంపై స్పందిస్తుందేమో చూడాలి.