కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీ ప్రత్యేక హోదాపై చివరి వరకూ పోరాడుతామని చెప్పారు.
పోలవరం నిధులు, ప్రత్యేక హోదా అంశాలను బడ్జెట్ లో ప్రస్తావించలేదని తెలిపారు.
బడ్జెట్ లో పోలవరం గురించి ప్రస్తావన లేకపోవడం బాధాకరమని వైసీపీ ఎంపీలు వ్యాఖ్యనించారు.
ఈ మేరకు విభజన హామీలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు.అదేవిధంగా రైల్వే కారిడార్ గురించి కూడా ప్రస్తావించలేదన్న ఎంపీలు పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులపై విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు.