ఈ మధ్య కాలంలో అషురెడ్డి ఎక్స్ ప్రెస్ హరి జోడీకి పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.ఈ జోడీ ఒకరిపై మరొకరు వేసుకుంటున్న పంచ్ లు ప్రేక్షకులను నవ్విస్తున్నాయి.
తాజాగా కామెడీ స్టార్స్ ప్రోమో రిలీజ్ కాగా అషురెడ్డి చేపలు అమ్మే అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి నా పేరు శీలావతి అని చెబుతారు.శీలావతి అని పేరు ఎందుకు పెట్టుకున్నావని ఎక్స్ ప్రెస్ హరి అడగగా మా అమ్మకు శీలావతి చేప అంటే ఎంతో ఇష్టమని అందుకే ఆ పేరు పెట్టారని అషురెడ్డి చెబుతారు.
ఆ తరువాత ఎక్స్ ప్రెస్ హరి ఇంకా నయం మీ అమ్మకు బొచ్చు అంటే ఇష్టం లేదు అంటూ అషురెడ్డి పరువు తీసేలా కామెంట్లు చేశారు.సాధారణంగా కామెడీ స్టార్స్ షోకు వర్షిణి యాంకర్ కాగా ఈ వారం ఎపిసోడ్ కు శ్రీముఖి యాంకర్ గా వచ్చారు.
సోషల్ మీడియా ద్వారా బాగానే పాపులారిటీని సంపాదించుకున్న అషురెడ్డి బుల్లితెర షోల ద్వారా మరింత బిజీ అవుతుండటం గమనార్హం.బుల్లితెరపై అషురెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ రోజురోజుకు పెరుగుతోంది.
డబ్ స్మాష్ వీడియోలతో కెరీర్ ను మొదలుపెట్టిన అషురెడ్డికి బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా పాపులారిటీని మరింత పెంచుకున్నారు.రాహుల్ సిప్లిగంజ్ తో సన్నిహితంగా ఉండటం ద్వారా ఈ బ్యూటీ కొంతకాలం వార్తల్లో నిలిచారు.అయితే ఆ తర్వాత తనకు, రాహుల్ కు మధ్య ఏమీ లేదని తాము మంచి ఫ్రెండ్స్ అని అషురెడ్డి చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన అషురెడ్డి పవన్ తో కలిసి దిగిన ఫోటో గతంలో తెగ వైరల్ అయింది.
గోరటి వెంకన్న కూడా ఈ వారం ఎపిసోడ్ కు గెస్ట్ గా హాజరయ్యారు.శేఖర్ మాస్టర్ డ్యాన్స్ స్టెప్పులు అద్భుతంగా వేసి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించారు.ఈ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.