జబర్దస్త్ ను బీట్ చేసేందుకు స్టార్ మా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.గతంలోనే కామెడీ షో తో ప్రయత్నించి చేతులు కాల్చుకుంది.
ఆ తర్వాత జీ తెలుగు వారు కూడా జబర్దస్త్ ను బీట్ చేసేలా ఒక కామెడీ షో ను మొదలు పెట్టారు.అక్కడ జబర్దస్త్ కమెడియన్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
అయితే ఆ కామెడీ షో ప్లాప్ అయ్యింది.ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన ఆ షో ను జీ తెలుగు మోయలేక పోయింది.
బాబోయ్ మా వల్ల కాదు అంటూ పక్కకు పెట్టింది.దాంతో నాగబాబు కనిపించకుండా పోయాడు.
మళ్లీ ఇప్పుడు స్టార్ మా వారు గత కొంత కాలంగా చేస్తున్న కామెడీ స్టార్స్ ను కామెడీ స్టార్స్ ధమాకా అంటూ మొదలు పెట్టి కొత్త రూపు తీసుకు వచ్చేలా ప్లాన్ చేశారు.అయితే ఈ కామెడీ స్టార్స్ ధమాకా లో మొత్తం అందరు కూడా జబర్దస్త్ మరియు ఢీ నుండి వచ్చిన వాళ్లే ఉన్నారు.
జడ్జ్ నాగబాబు జబర్దస్త్ నుండి కాగా మరో జడ్జ్ పూర్ణ ఢీ నుండి వచ్చింది.ఇక దీపిక పిల్లి యాంకర్ ను ఢీ నుండి తీసుకు వచ్చారు.
ఇక కమెడియన్స్ మొత్తం కూడా జబర్దస్త్ తో పాపులారిటీని దక్కించుకున్న వారే.ఒక్కరు ఇద్దరు తప్ప మొత్తం అంతా కూడా అక్కడ నుండి వచ్చిన వారే అవ్వడంతో జబర్దస్త్ చూస్తున్న ఫీల్ కలుగుతుందని కొందరు అంటున్నారు.
అయితే జబర్దస్త్ కామెడీ షో తో ఈటీవీ టాప్ లో ఉంది.ఆ రికార్డును బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యంతో అంతా ఆసక్తిగా ఉన్నారు.ఈ సమయంలో స్టార్ మా వారికి ఒక మంచి అవకాశం అయితే కల్పించింది.నాగబాబు కూడా వారికి జత కలవడం వల్ల ఖచ్చితంగా మంచి ఆధరణ దక్కుతుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది.
మరి జబర్తస్త్ తో పాటు జనాలు కామెడీ స్టార్స్ ధమాకా ను కూడా చూస్తారా అనేది చూడాలి.