కిడ్నీ ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్న కమెడియన్.. సాయమందించిన కోలీవుడ్ స్టార్స్?

కోలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హాస్యనటుడు బోండా మణి ప్రస్తుతం చెన్నైలోని ఓమండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.ఈయన గతంలో గుండెపోటు సమస్యతో బాధపడి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేసుకొని చికిత్స తీసుకోగా తాజాగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలతో సతమతమవుతున్నారు.

 Comedian Suffering From Kidney Failure Kollywood Stars Helped, Comedian Sufferin-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈయన రెండు కిడ్నీలో ఫైల్ కావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈయన పరిస్థితిని వివరిస్తూ మరొక కమెడియన్ బెంజిమన్ ఈయనకు ఆర్థిక సహాయం చేయాలంటూ ఒక వీడియో షేర్ చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటుడు బోండా మణికి సహాయం చేయడానికి కోలీవుడ్ స్టార్ హీరోలు ధనుష్ విజయ్ సేతుపతి ముందుకు వచ్చారు.ఈయన పరిస్థితి తెలుసుకున్న నటుడు విజయ్ సేతుపతి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

Telugu Chennai, Dhanush, Kidney Failure, Kollywoodstars, Omandur, Sethupathi-Mov

అదేవిధంగా హీరో ధనుష్ సైతం మరో లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఈయనకు అండగా నిలిచారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ హీరోలపై ప్రశంసలు కురిపించడమే కాకుండా వీరిలాగే మరికొందరు మంచి మనసుతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు.ఇకపోతే ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube