అవతారం మార్చిన కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి! దర్శకుడుగా కొత్త ప్రయత్నం

ఇడియట్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ శ్రీనివాస రెడ్డి టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా మారిపోయాడు.స్టార్ హీరోల చిత్రాలలో చాలా వరకు అతనిని తీసుకుంటున్నారు.

 Comedian Srinivasa Reddy Turned As A Director-TeluguStop.com

సునీల్ తర్వాత ఆ స్థాయిలో తన కామెడీ టైమింగ్ లో హాస్య నటుడుగా తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన శ్రీనివాస రెడ్డి గీతాంజలి సినిమాతో హీరోగా తన అదృష్టం పరీక్షించుకొని మొదటిసారిగా హిట్ కొట్టాడు.తరువాత జయమ్ము నిచ్చయమ్మురా సినిమాతో మరో హీరోగా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే ముచ్చటగా మూడో సారి జంబలకిడిపంబ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఫ్లాప్ కొట్టాడు.దీంతో హీరోగా చేయడం మానేస్తాడని అందరూ భావించారు.

అయితే ఈ సారి ఈ కమెడియన్ కం హీరో శ్రీనివాసరెడ్డి మరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసాడు.

టాలీవుడ్ కమెడియన్స్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న గ్రూప్ కలిసి ఓ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని నిర్మిస్తున్నారు.

బాగ్యనగర వీధుల్లో టైటిల్ ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా దీనికి దర్శకత్వ బాద్యతలు కూడా శ్రీనివాసరెడ్డి నిర్వర్తించడం విశేషం.అలాగే ఈ సినిమాలో అతనే హీరో.అలాగే మిగిలిన కమెడియన్స్ అందరూ కీలక పాత్రలు చేస్తున్నారని సమాచారం.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు సమాచారం.మరి హీరో నుంచి దర్శకుడుగా మారిన శ్రీనివాసరెడ్డి ఎంత వరకు తమ కమెడియన్స్ టీం అందరికి సక్సెస్ ఇస్తాడు అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube