టాలీవుడ్ లో కమెడియన్స్ అంటే ప్రతి తరానికి కొంత మంది ప్రత్యేకంగా కనిపిస్తారు.రాజబాబు, రేలంగి, పద్మనాభం, అల్లు రామలింగయ్య ఒక తరం అయితే తరువాత బ్రహ్మానందం హవా కొనసాగింది, మధ్యలో అలీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇప్పటికి సినిమాలలో కమెడియన్ అలీ కోసం కొంత మంది దర్శకులు ప్రత్యేక పాత్రలు సృష్టిస్తూ ఉంటారు.తరువాత వేణు మాధవ్, సునీల్ తరం మొదలైంది.
వీళ్ళు స్టార్ కమెడియన్స్ గా తన జోరు చూపించారు.ఆ తరువాత సునీల్ హీరోగా టర్న్ తీసుకోవడంతో శ్రీనివాసరెడ్డి, ధనరాజ్, వేణు , వెన్నెల కిషోర్ వంటి కమెడియన్స్ వచ్చారు.
అయితే వీరిలో స్టార్ కమెడియన్ గా వెన్నెల కిషోర్ తన ప్రస్తానం కొనసాగిస్తున్నాడు.ఇక గత ఐదేళ్ళ కాలంలో కమెడియన్ సత్య కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేసుకున్నాడు.
వీరిలో చాలా మంది కమెడియన్స్ హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకున్నారు.
ఇప్పుడు కమెడియన్ సత్య కూడా హీరోగా తన అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు.
సందీప్ కిషన్ నిర్మాతగా తెరకెక్కుతున్న వివాహ భోజనంబు సినిమాలో సత్య హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తుంది.సందీప్ కిషన్ ఈ సినిమాలో హీరో ఎవరనేది చెప్పకపోయిన నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇందులో హీరోగా నటిస్తున్నాడని హింట్ ఇచ్చాడు.
ప్రీ లుక్ లో హీరో పేస్ అయితే రివీల్ చేయలేదు కాని ఆ పాత్ర చేస్తుంది సత్య అని గట్టిగా వినిపిస్తుంది.ఇది ఎంత వరకు నిజమో తెలియదు కాని, ఒక వేళ సత్య ఇందులో హీరో అయితే కామెడీకి ఎలాంటి డోకా ఉండదని మాత్రం చెప్పొచ్చు.
ఇక సినిమా హిట్, ఫట్ అనే విషయం దర్శకుడు మేకింగ్ మీద ఆధారపడి ఉంటుంది.