సెల్ఫ్ క్వారెంటైన్ కి వెళ్లిపోయిన టాలీవుడ్ ప్రముఖ కమెడియన్... అలాగే ఛాలెంజ్ 

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్లలో ప్రముఖ కమెడియన్ రఘు కారుమంచి ఒకడు.అయితే “అదుర్స్” చిత్రంలో లో విలన్ పాత్రలో నటించిన రఘు చేసిన కామెడీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

 Comedian Raghu Karumanchi Decided To Be Self Quarantine-TeluguStop.com

అయితే కమెడియన్ రఘు ఒక పక్క కామెడీ పాత్రలలో నటిస్తూనే మరో పక్క సీరియస్ పాత్రలు కూడా చేస్తున్నాడు.అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతుండడంతో కమెడియన్ రఘు స్వీయ నిర్బంధంలో కి వెళ్లి పోతున్నట్లు వీడియో ద్వారా ప్రేక్షకులకు తెలిపాడు.

అంతేకాక రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటూ ఈ నెల 31వ తారీకు వరకు తను ఇంట్లోనే ఉంటున్నట్లు తెలిపాడు.ఇందులో భాగంగా తనకు ఇష్టమైన సినిమాలను చూస్తూ, తన కుటుంబ సభ్యులతో గడుపుతూ, ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చాడు.

అంతేగాక ఈ స్వీయ నిర్బంధంకి తన మిత్రులు రాజీవ్ కనకాల, టాలీవుడ్ హీరో నందు, దీపక్ సురేందర్ మరియు జబర్దస్త్ ఫేమ్ ధనరాజ్ లను నామినేట్ చేస్తున్నానని తెలిపాడు.

అయితే ఈ విషయం ఉన్నాయి ఉండగా ఇప్పటికే పలువురు టాలీవుడ్ లోని సినీ ప్రముఖులు స్వీయ నిర్బంధం లోకి వెళ్ళిపోయారు.

ఇందులో ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి తదితరులు ఇతర దేశాల్లో షూటింగ్ షూటింగ్ ముగించుకుని రావడంతో వారంతటవారే ఈ స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube