టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.గత కొద్ది రోజులుగా తీవ్రమైన జ్వరంతో పృథ్వీరాజ్ బాధపడుతున్నారు.
దీంతో ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించగా., నెగిటివ్ రిపోర్టు వచ్చింది.
కోవిడ్ నెగిటివ్ వచ్చినప్పటికీ 15 రోజులు ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.దీంతో పృథ్వీరాజ్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
శ్వాసకోశ సమస్య తలెత్తడంతో ఆక్సిజన్ ద్వారా శ్వాస తీసుకుంటున్నట్టు ఆస్పత్రి నుంచి పృథ్వీరాజ్ ఓ వీడియో రిలీజ్ చేశారు.
పృథ్వీరాజ్ రిలీజ్ చేసిన వీడియోలో ప్రజల ఆశీర్వాదాలు కావాలంటూ కోరారు.
డాక్టర్ల సూచన మేరకు క్వారంటైన్ లో ఉంటున్నట్లు.ఆస్పత్రిలో చేరానని తెలిపారు.
అభిమానుల ఆశీర్వాదాలతో పాటు వెంకటేశ్వర స్వామి దీవెనలు తనకుండాలని కోరుకుంటున్నానని అన్నారు.త్వరలోనే ఆరోగ్య వంతుడ్ని కావాలని కోరుకుంటున్నట్లు పృథ్వీరాజ్ తన వీడియోలో తెలిపారు.
అయితే లాక్ డౌన్ కారణంగా పృథ్వీరాజ్ చాలా కాలం ఇంటికే పరిమితం అయ్యారు.అనంతరం లాక్ డౌన్ సడలింపులతో బయటికి వచ్చారు.
పృథ్వీరాజ్ కొన్ని సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.