30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే పాపులర్ డైలాగ్ తో పృథ్వీ రాజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.నటుడిగా కామెడీ పాత్రల్లో ఎక్కువగా నటించిన పృథ్వీ కొన్ని నెలల క్రితం ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ నెల 11వ తేదీన ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు గెస్ట్ గా హాజరైన పృథ్వీ ఆ షోలో శ్రీమంతుడిగా కనిపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
ఆది పృథ్వీ ఒకరిపై మరొకరు వేసుకున్న పంచ్ లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
అయితే స్కిట్ లో భాగంగా పృథ్వీ తన ఫ్రెండ్ గౌతమ్ రాజు గురించి చెప్పగా కొంతమంది ప్రముఖ ఆర్టిస్ట్ గౌతమ్ రాజు గురించి పృథ్వీ చెప్పాడని భావించారు.స్కిట్ లో నూకరాజు ఇప్పుడు మేము పేదవాళ్లం అయినప్పటికీ ఒకప్పుడు రాజులమని చెబుతాడు.
మీరు రాజులేంటి అని అడగగా తన పేరు నూకరాజు అని తండ్రి పేరు పోతురాజు అని తమ్ముడి పేరు లోకరాజు అని నూకరాజు చెబుతాడు.
ఆ తరువాత పృథ్వీ ఈ విధంగా చెప్పుకునే గౌతమ్ రాజు బ్రతికేస్తున్నాడు అంటూ కామెంట్ చేయగా చాలమంది ఆర్టిస్ట్ గౌతమ్ రాజును ఉద్దేశించి పృథ్వీ ఈ పంచ్ వేశారని భావించడం తాజాగా సోషల్ మీడియా ద్వారా పృథ్వీ వివరణ ఇచ్చుకున్నారు.తాను ఒక గౌతమ్ రాజు గురించి చెబితే మరొక గౌతమ్ రాజు అనుకొ
ని పొరబడ్డారని సందర్భానికి అనుగుణంగా ఆ పేరును వాడానని పృథ్వీ చెప్పుకొచ్చారు.
ఆర్టిస్ట్ గౌతమ్ రాజు గురించి తాను చెప్పలేదని పొరపాటు జరిగిందని పృథ్వీ చెప్పుకొచ్చారు.ఎవరినీ కించపరచడం తన ఉద్దేశం కాదని ఈ వివాదాన్ని పెద్దది చేయవద్దని పృథ్వీ కోరారు.పృథ్వీ వివరణ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ వివాదం సద్దుమణుగుతుందేమో చూడాల్సి ఉంది.