బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అవినాష్ ఇదే పాపులారిటీతో బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకొని చివరి వారాలలో బయటకు వచ్చిన అవినాష్ అనంతరం స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రత్యేకమైన ఈవెంట్స్, అలాగే కామెడీ స్టార్స్ కార్యక్రమంలో తన స్కిట్ ద్వారా ప్రేక్షకులను మరింత సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో తన భార్యతో కలిసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.
అయితే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అవినాష్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఆఫర్ రావడంతో దాదాపు 10 లక్షల రూపాయలు జబర్దస్త్ కార్యక్రమానికి చెల్లించి బయటకు వచ్చారనే విషయం మనందరికీ తెలిసిందే.ఇలా ఈటీవీ నుంచి బయటకు వచ్చిన అవినాష్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.
ఈ క్రమంలోనే స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమం సరికొత్త రూపురేఖలను మార్చుకొని ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ క్రమంలోనే కామెడీ స్టార్స్ కాస్తా కామెడీ స్టార్స్ ధమాకాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ కార్యక్రమానికి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మెగా బ్రదర్ నాగబాబు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.అలాగే దీపికా పిల్లి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఈ ప్రోమోలో భాగంగా జిగేల్ జీవన్ ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటూ పాట పాడుతూ వస్తారు.
అలా జీవన్ పాట పాడే సరికి ముక్కు అవినాష్ స్పందిస్తూ నేను కూడా అలాగే అనుకున్నాను.కానీ ఒక్క ఈవెంట్ కి పక్కకు వెళ్లగానే 4 ఎపిసోడ్ లలో లేకుండా తప్పించారు.
అంటూ స్టార్ మా పై ఆరోపణలు చేశారు ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.