బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ టీమ్ లో స్కిట్ల ద్వారా పాపులారిటీతో పాటు గెటప్ శ్రీను మంచిపేరును సంపాదించుకున్నారు.గెటప్ శ్రీను వల్లే సుధీర్ టీమ్ చేసే స్కిట్లు హిట్ అవుతున్నాయని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే గెటప్ శ్రీను కమెడియన్ గా సక్సెస్ కావడానికి ముందు ఎన్నో కష్టాలు పడ్డారు.ప్రస్తుతం గెటప్ శ్రీనుకు సినిమాలలో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో జాంబీ రెడ్డి సినిమాలో చేసిన పాత్ర గెటప్ శ్రీను కు మంచి పేరు తెచ్చిపెట్టింది.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో గెటప్ శ్రీను కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.
అయితే జబర్దస్త్ షోలోకి రాకముందు గెటప్ శ్రీను పొలం పనులు చేశారు.తాజాగా ఒక నెటిజన్ గెటప్ శ్రీనును ఫస్ట్ శాలరీ గురించి ప్రశ్నించగా తన ఫస్ట్ శాలరీ కేవలం 40 రూపాయలు అని గెటప్ శ్రీను ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం గెటప్ శ్రీను కమెడియన్ గా స్కిట్ల ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు.వెరైటీ ఎక్స్ ప్రెషన్లతో గెటప్ శ్రీను చేసే కామెడీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది.మరోవైపు గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ అనే సినిమా తెరకెక్కుతోంది.గెటప్ శ్రీనుకు జోడీగా ఈ సినిమాలో అంకితా ఖరత్ నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే గెటప్ శ్రీను హీరోగా వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఈ సినిమాతో గెటప్ శ్రీను ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.సినిమాల్లో ఆఫర్లు వస్తున్నా కమెడియన్ గా గుర్తింపును ఇచ్చిన జబర్దస్త్ ను మాత్రం గెటప్ శ్రీను దూరం కావడం లేదు.