తాజాగా విశాఖ పట్టణంలోని ఓ అపార్ట్ మెంట్ లో జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది టీం లో కామెడీ చేసేటటువంటి దొరబాబు మరియు పరదేశి అనే ఇద్దరు కమెడియన్లు వ్యభిచారంలో పాల్గొంటూ పోలీసులకి చిక్కిన ఈ విషయం అందరికీ తెలిసిందే.అయితే ఈ విషయం గురించి నెట్టింట్లో పలు వార్తలు కథనాలు వినిపిస్తున్నప్పటికీ దొరబాబు, పరదేశి మాత్రం మీడియా ముందుకు రాకపోవడంతో కొందరు ఈ వార్తలు నిజమేనని నమ్ముతున్నారు.
అయితే అందుకు కారణాలు లేకపోలేదు. గతంలో కూడా దొరబాబు పలు బి గ్రేడ్ చిత్రాల్లో నటించి యూట్యూబ్లో మంచి రసికుడనే పేరు సంపాదించుకున్నాడు.
దీంతో హైపర్ ఆది కూడా తన స్కిట్ లో ఎక్కువగా కామెడీ పండించడం కోసం ఎక్కువగా ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ పంచులు పెలుస్తుంటాడు.దీంతో కొంత మంది ప్రేక్షకులు కూడా దొరబాబు అలాంటి పాత్రలు చేస్తారని భ్రమలో ఉండిపోయి నమ్మేస్తున్నారు.
అయితే 2018 సంవత్సరంలో దొరబాబు యాంకర్ నందు అనే యాంకర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అయితే పెళ్లయిన తర్వాత దొరబాబు అలాంటి చిత్రాల్లో నటించడం మానేశాడు.అంతేగాక వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కూడా ఉండేవాళ్ళు.అయితే ఇటీవలే దొరబాబు పేరులోని మొదటి అక్షరాన్ని నందు తన చేయి పై టాటా కూడా వేయించుకుంది.
అంతేగాక ఈ విషయాన్ని తన టిక్ టాక్ అభిమానులతో పంచుకుంటూ డి ఫర్ దొరబాబు, మై లైఫ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.కానీ అదే రోజునే దొరబాబు వ్యభిచార గృహంలో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
అంతేగాక నందు తన టాటా వీడియోని అప్లోడ్ చేసిన రోజునే తన భర్త వ్యభిచారం నిర్వహిస్తూ ఆ సమయంలో తీసిన వీడియో కూడా సోషల్ మీడియాలో కొందరు అజ్ఞాత వ్యక్తులు షేర్ చేశారు.దీంతో దొరబాబు పై నందు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత మంచి భార్య ని ఉంచుకొని ఇలాంటి పనులు ఏంటి దొరబాబు అంటూ మండిపడుతున్నారు.
అంతేగాక దొరబాబు బి గ్రేడ్ చిత్రాల్లో నటించాడని తెలిసికూడా నందు అతనిని పెళ్లి చేసుకుందంటే ఆమె మంచి మనస్తత్వానికి హాట్సాఫ్ అంటున్నారు అభిమానులు.ఏదేమైనప్పటికీ అన్యోన్యంగా ఉంటూ ఉన్నటువంటి ఒక బంధంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.అంతే కాక ఈ మధ్య కాలంలో తన సీట్లతో కామెడీని పండించేటువంటి దొరబాబు సినిమాల్లో కూడా అడపాదడపా నటిస్తూ బాగానే రాణిస్తున్నాడు.
.