అలనాటి కాలంలో అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా పేరు తెచ్చుకున్న హీరో శోభన్ బాబు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మరపురాని చిత్రాలను తీసి ఎంతోమందిని అభిమానులుగా మార్చుకున్న వ్యక్తి ఆయన.
ఇప్పటికీ ఆయన సినిమాలు టీవీలలో వస్తే ఎంతో మంది శోభన్ బాబు అభిమానులు టీవీకి అతుక్కుపోయి మరి చూసే వారు ఎందరో ఉన్నారు.ఇకపోతే ఆయన సినిమాలో నటించక పోవడానికి గల కారణాన్ని తాజాగా తెలిపాడు హాస్యనటుడు అలీ.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతుండగా మాటల సందర్భంలో శోభన్ బాబు విషయం సంబంధించి రాగా అందుకు ఆయన శోభన్ బాబు పక్కన తాను నటించడానికి ముందు చాలా భయపడ్డానని చెప్పుకొచ్చారు.అప్పుడు శోభన్ బాబు గారే తనకు ధైర్యం చెప్పారని అలీ తెలిపారు.
అయితే శోభన్ బాబు గారు సినిమాలను దూరం కావడానికి గల కారణాన్ని ఆయన తెలుపుతూ ఎప్పటికీ తాను అభిమానుల మనసుల్లో అందగాడుగానే ఉండాలని అందుకే ఒక వయసు వచ్చాక ఆయన సినిమాలు మానేశారని చెప్పుకొచ్చారు.ఒక వయసులో ఆయనకు ఆయనే తనకు వయస్సు వచ్చిందని ఇన్నాళ్లు సినిమాలు చేసి అలరించానని ఇక ఆపేద్దాం అంటూ ఆయన స్వయంగా నిర్ణయం తీసుకొని సినిమాలు చేయడం ఆపేసినట్లు కమిడియన్ అలీ చెప్పుకొచ్చారు.
ఇకపోతే శోభన్ బాబు తన వారసత్వంగా ఎవరిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు.తన పిల్లల్ని కూడా సినిమాల వైపు రాకుండా బాగా చదివించారు.అప్పట్లోనే చెన్నై నగరం చుట్టుపక్కల కొన్ని వందల ఎకరాల స్థలాలను శోభన్ బాబు గారు కొన్నారు.ఇప్పటికీ ఆ భూములు అలాగే ఉన్నాయని వాటి విలువ కొన్ని వందల కోట్లు ఉంటాయని సినిమా వర్గాల వారి అంచనా.
ఒకానొక సమయంలో శోభన్ బాబు గారు భారత దేశంలోనే అత్యంత సంపన్నుడిగా పేరు పొందిన వ్యక్తి అని ఎందరో అనేవారు.