టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి గురించి మనందరికీ తెలిసిందే.ఒకానొక సమయంలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఛార్మి ఇక ప్రస్తుతం నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.
హీరోయిన్ గా వెండితెరకు దూరం అయిన ఆమె ప్రస్తుతం తన దృష్టిని మొత్తం ప్రొడక్షన్ పైనే పెట్టేసింది.ఈ క్రమంలోనే టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి సినిమా నిర్మాణంలో భాగంగా భాగం అవుతోంది.
ఈ క్రమంలోనే దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మి ఇస్మార్ట్ శంకర్ సినిమా విషయంలో కూడా భారీ లాభాలను అందుకున్నారు.
ఇకపోతే ప్రస్తుతం పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా లైగర్.
ఈ సినిమాకు నిర్మాతగా చార్మి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ పొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ లైగర్ సినిమాఫై టాలీవుడ్ కమెడియన్ ఆలీ కామెంట్స్ చేసాడు.అయితే ఆ కామెంట్స్ కు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికరంగా స్పందించింది ఛార్మి.ఈ క్రమంలోనే తాజాగా ఒక మీడియాతో మాట్లాడిన ఆలీ పూరి జగన్నాథ్ దర్శకత్వం గురించి పొగుడుతూ,లైగర్ సినిమా తెలుగు సినిమాలా కాకుండా హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని తెలిపాడు.
ఆయన జెండా ఇక్కడ పాతాడు.బాలీవుడ్ లో జండా కుట్టించాడు అంటూ ఆలీ చెప్పిన మాటలు ప్రస్తుతం విడుదలవుతున్నాయి.అయితే ఇందుకు సంబంధించిన వీడియోని ఛార్మి షేర్ చేస్తూ.మీరు లేనప్పుడు మీ గురించి గొప్పగా చెప్పే వాడే నిజమైన స్నేహితుడు అంటూ కామెంట్ చేసింది.
ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.