అంజలి ప్రధాన పాత్రలో నటించిన ‘గీతాంజలి’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.చిన్న చిత్రంగా తెరకెక్కిన ఆ చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ సభ్యులు అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు.
కథకు కొనసాగింపుగా అదే తరహా స్క్రీన్ప్లేతో ఎంటర్టైన్మెంట్తో సీక్వెల్ను చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు.అందుకోసం మొదట ఈ సీక్వెల్లో కూడా అంజలిని అనుకున్నారట.
కాని ఆమె పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేయడంతో మరో హీరోయిన్ను వెదికే పనిలో పడ్డారు.ఆ మద్య ఈ సినిమాలో స్వాతిని హీరోయిన్గా ఎంపిక చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ చిత్ర సీక్వెల్ గురించిన అధికారిక ప్రకటన వచ్చింది.ఈ సీక్వెల్లో తెలుగమ్మాయి స్వాతి నటిస్తున్నట్లుగా చిత్ర అయూనిట్ సభ్యులు ప్రకటించారు.
మొదటి పార్ట్లో తెలుగమ్మాయి అయిన అంజలి నటించడం మరియు రెండవ పార్ట్లో తెలుగమ్మాయి అయిన స్వాతి నటించడం ఇక్కడ గమనించదగ్గ విషయం.హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.
మొదటి పార్ట్లో కనిపించిన శ్రీనివాసరెడ్డి ఈ సీక్వెల్లో ఉండేది అనుమానంగానే ఉంది.ఈ సీక్వెల్ వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లబోతుంది.‘గీతాంజలి`2’గా ఈ సినిమా టైటిల్ను ఫిక్స్ చేయబోతున్నారు.మరి మొదటి పార్ట్లా రెండవ పార్ట్ భయపెట్టి నవ్విస్తుందో చూడాలి.