తెలుగులో మొదట్లో చిన్న చిన్న షోల్లో యాంకరింగ్ చేస్తూ హీరోయిన్ గా ఎదిగినటువంటి టాలీవుడ్ హీరోయిన్ కలర్స్ స్వాతి గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు యాంకర్ గా నటిస్తున్న సమయంలో ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన “డేంజర్” అనే చిత్రంలో ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.
ఆ తరువాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “అష్టా చమ్మ” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఇటీవల కాలంలోనే స్వాతి వికాస్ వాసు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
దీంతో ఈ మధ్య కాలంలో కలర్స్ స్వాతి సినిమాల పరంగా కొంత మేర జోరుని తగ్గినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తనపై వస్తున్నటువంటి వార్తల గురించి స్పందించింది.
ఇందులో భాగంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లను సృష్టించి పలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాపోయింది.అంతేకాక ఆ ఖాతాలకు సంబంధించిన వివరాలను కూడా తన అభిమానులకు తెలియజేస్తూ దయచేసి తన నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఫాలో కావద్దంటూ సూచించింది.
అలాగే సమాజంలో హోదా కలిగినటువంటి వ్యక్తుల పేర్లను ఉపయోగించుకొని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు అసత్య ప్రచారాలు చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా కలర్స్ స్వాతి పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమేర బరువు పెరగడంతో ఈ మధ్యకాలంలో సినిమాల్లో మళ్లీ నటించడం కోసం బరువు తగ్గే పనిలో పడింది.
ఇటీవలే కలర్స్ స్వాతికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.గతంలో ఈ అమ్మడు నటించిన టువంటి కార్తికేయ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
దీంతో కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రంలో కూడా కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.