వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరవాత ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా లో ఉన్నరంగులను కార్యాలయాలకు వేస్తున్నారు.దీనిపై ప్రతిపక్షాల పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా రంగులు మార్చే కార్యక్రమంలో నిమగ్నం అయ్యింది.
అయితే ఈ వ్యవహారం హైకోర్టు కు చేరడంతో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు ఏమిటంటూ కోర్టు నిలదీసింది.
అసలు ఏ ప్రాతిపదికన రంగులు వేశారో పది రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ గుంటూరు కలెక్టర్ను కోర్టు ఆదేశించింది.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసిపి జెండా రంగులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయ స్థానం ప్రభుత్వం తీరుపై తీవ్రంగా స్పందించింది.ప్రభుత్వ భవనాలకు పార్టీ జెండా రంగులు ఎలా వేస్తున్నారని ప్రశ్నించింది.
ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.