సుహాస్, ఛాందిని చౌదరి జంటగా నటించిన కలర్ ఫొటో సినిమా దసరా కానుకగా ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాకు సినీ ప్రముఖులు ప్రచారం చేయడంతో లక్ కలిసి వచ్చింది.చిన్న బడ్జెట్ తో తెరకెక్కినా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ విమర్శకులు అంటున్నారు.
ఒక సింపుల్ కథను యాంటీ క్లైమాక్స్ను ప్రేక్షకులను నొప్పించకుండా రూపొందించడం నిజంగా అభినందనీయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా కథను నిర్మాత సాయి రాజేష్ తయారు చేశాడు.
ఆయన దర్శకత్వం చేయాలనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల సందీప్ రాజ్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు.ఆ సినిమా విడుదలకు ముందు నుండే ప్రోమో మరియు పోస్టర్లతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ సినిమాతో సుహాస్లో మంచి నటుడు బయటకు వచ్చాడు.ఇదే సమయంలో ఛాందిని చౌదరికి మంచి మార్కులు పడ్డాయి.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని మొదటి నుండి ప్రచారం చేశారు.అన్నట్లుగానే సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా సక్సెస్ దక్కించుకుంది.
ప్రస్తుతం సినిమా ఆహాలో ట్రెండ్ అవుతుంది.తెలుగు ప్రత్యేకమైన ఓటీటీ ఛానెల్ ఆహాకు ఈ సినిమా వల్ల కొత్త సబ్స్క్రైబర్స్ జాయిన్ అయ్యారు.
దాదాపుగా 40 లక్షల మంది ఆహాను మెంబర్షిప్ను తీసుకున్నారట.మొత్తానికి ఆహా సినిమాలో కలర్ ఫొటో స్ట్రీమింగ్ అవ్వడంతో అందరు కూడా అంచనాలు భారీగా పెంచేసుకున్నారు.
అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంది.దానికి తోడు రాజమౌళి, నాని, రవితేజ ఇంకా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసి బాగుందని అనడంతో చాలా మంది కలర్ ఫొటోను చూస్తున్నారు.
నాని ఈ సినిమాను తాను రెండు సార్లు చూశాను అంటూ దర్శకుడితో చెప్పాడట.