కలర్ ఫోటో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు సందీప్ రాజ్.సుహాస్, చాందినీ చౌదరీ జోడీగా వచ్చిన ఈ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా తెరకెక్కింది.
ఈ సినిమాని తక్కువ బడ్జెట్ లో తీసిన మంచి కలెక్షన్స్ రాబట్టింది.సినిమా ఈ జెనరేషన్ యూత్ కి భాగా కనెక్ట్ కావడంతో సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయిన సందీప్ రాజ్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది.ఇదిలా ఉంటే కలర్ ఫోటో సినిమా తర్వాత ఈ యంగ్ డైరెక్టర్ భాగా గ్యాప్ తీసుకున్న ఈ లోపు గీతా ఆర్ట్స్ లాంటి మెగా బ్యానర్ లో అవకాశం పట్టేశాడు.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్ సందీప్ రాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.ఇక ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే జరుగుతుందని తెలుస్తుంది.
అయితే ఈ సినిమాని లో బడ్జెట్ లోనే తెరకెక్కించాలని ముందు భావించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం అయిన తర్వాత కాన్సెప్ట్ అద్బుతంగా వచ్చిందని, ఈ నేపధ్యంలో పెద్ద హీరోతో ఈ సినిమా చేయడానికి నిర్మాత బన్నీ వాస్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది.అయితే ఈ సినిమాని అవకాశం ఉంటే మెగా హీరోలతోనే చేయాలని అనుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది.
ఒక వేళ మెగా హీరోల డేట్స్ దొరకకపోతే బయటి హీరోలకి వెళ్లాలని అనుకుంటున్నారు.ఇప్పుడు మెగా కాంపౌండ్ లో సందీప్ రాజ్ సినిమా గురించి జోరుగా చర్చ నడుస్తుందని సమాచారం.
ఏది ఏమైనా మొదటి సినిమాతో హిట్ కొట్టిన ఒటీటీకి మాత్రమే సందీప్ రాజ్ టాలెంట్ పరిమితం అయిపోయింది.అయితే ఇప్పుడు గీతా ఆర్ట్స్ దయవల్ల పెద్ద హీరో సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుండటం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.