తమిళనాడులోని తిరుచ్చిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.పోలీస్ అవతారమెత్తిన ఒక యువకుడు ప్రేమజంటను బెదిరించి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
గంజాయి మత్తులో ఉన్న బాధితురాలు తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని అడ్డుకోలేని నిస్సహాయ స్థితి లో ఉండిపోయింది.ప్రేమికుడిని బెదిరించి ఆ యువతిని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి తెలుస్తుంది.
మహారాష్ట్రకు చెందిన ఓ యువతి తమిళనాడులోని తిరుచ్చి ఎన్ఐటీ ఇంజినీరింగ్ కాలేజ్లో మూడో సంవత్సరం చదువుతోంది.అక్కడే చెన్నైకి చెందిన విద్యార్థితో ప్రేమలో పడిన ఆమె అతడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది.
ఆదివారం రాత్రి సమయంలో కాలేజీకి దగ్గర్లో ఉన్న బస్టాప్లో ప్రేమికులిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో పోలీసు యూనిఫామ్లో వచ్చిన ఓ వ్యక్తి ఇక్కడేం చేస్తున్నారంటూ ప్రశ్నించాడు.ప్రియుడిపై చేయి చేసుకోవడంతో అతడు పారిపోయాడు.
గంజాయి మత్తులో ఉన్న యువతిని ఎత్తుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి వదిలి వెళ్లిపోయాడు.బాధితురాలి ప్రియుడి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తువాక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఘటన ప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని తిరుపెరంబూరుకు చెందిన మణికంఠన్గా గుర్తించారు.మంగళవారం అతడున్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు పట్టుకోవడానికి వెళ్లారు.వారి రాకను గుర్తించిన మణికంఠన్ తప్పించుకునే క్రమంగా పరుగెత్తుతూ కింద పడిపోవడం తో కాలికి ఫ్రాక్చర్ కూడా అయినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు.