మానవాళి స్వేచ్చకు భంగం వాటిల్లేలా పరిస్దితులు వెంటపడి తరుముతున్నాయి.మనుషుల ప్రాణాలకు ముప్పు ఏ దిక్కు నుండి ఎదురవుతుందో ఊహించడం కష్టం.
ఇంతటి ఆపత్కాల సమయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా ప్రమాదాలు మాత్రం నీడలా వెంటాడుతూనే ఉన్నాయి.నిత్యం ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒక చోట ఎదురవుతూనే ఉన్నాయి.
ఇకపోతే తాజాగా విశాఖపట్నం లోని హెచ్ పీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.హెచ్ పీసీఎల్ క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్లో జరిగిన ఈ ప్రమాదంలో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో కార్మికులు భయాందోళనలో పరుగులు పెట్టారు.
అయితే ఈ మ్రమాద ఘటన పై స్పందించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ, ఈ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు.కాగా ప్రమాద సమాచారం అందుకోగానే రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా ఘటన స్దలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.